Sunday, July 31, 2016

గర్భిణీల్లో మధుమేహ సమస్య జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes )

                    నేడు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే. ఇంకా భూమిపై పడని అమ్మకడుపులోని పాపాయి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపేంతగా. గర్భిణుల్లో వచ్చే మధుమేహం కొంతమందిలో ప్రసవం తర్వాత దూరమవుతుంది. మరికొందరిలో ప్రసవం తర్వాత కూడా కొనసాగుతుంది. ఈ అంశంపై అంతర్జాతీయస్థాయిలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దీని నియంత్రణకు గర్భిణీల్లో వచ్చే మధుమేహం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి.
గర్భిణీల్లో మధుమేహం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. కాబోయే అమ్మ గర్భం దాల్చి 24 వారాలు నిండిన తర్వాత తప్పనిసరిగా ఓరల్‌ గ్లూకోజ్‌ టోరెన్స్‌ టెస్ట్‌ (ఓజిటిటి/OGTT ) చేయించుకోవాలి. ఫాస్టింగ్‌ షుగర్‌ పరీక్షలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 90 కన్నా ఎక్కువ, పోస్టుప్రాండియాల్ షుగర్‌ పరీక్షలో 140 కన్నా ఎక్కువగా ఉన్నా జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes ) అంటారు. ఇందుకు కారణాలు ప్రధానంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉన్నవారు ఆహార మార్పులతో పాటు అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు ఇన్సులిన్‌ వాడవలసి ఉంటుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వల్ల రెండు ప్రధాన సమస్యలు వస్తాయి. అవి ఒకటి గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరుగుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు వస్తాయి. రెండు శిశువుకు గర్భంలో షుగర్‌ అలవాటు కావడం వల్ల డెలివరీ అయిన వెంటనే శిశువు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. పాపాయిని ఐసియులో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లికి ప్రెగెన్సీలో డయాబెటిస్‌ వస్తే బిడ్డకు డయాబెటిస్‌ వస్తుందని చాలా మంది భయపడతారు. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భిణీలకు డయాబెటిస్‌ ఉంటే పిల్లలకు  వెంటనే రాదు. జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ఉన్నవారిలో ప్రసవం తర్వాత డయాబెటిస్‌  మామూలుగా తగ్గిపోతుంది. అయితే వీరిలో యాభై శాతం మందికి నాలుగైదు సంవత్సరాల్లో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
జాగ్రత్తలు
ప్రసవం తర్వాత సరైన ఆహారం తీసుకోనివారిలో, ఆహారపు నియమాలు పాటించని వారిలో త్వరగా డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రసవం తర్వాత బరువు తగ్గుతారు. కొంతమంది మాత్రం మొదటి మూడునెలలు బరువు తగ్గి ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు పాలివ్వని తల్లులు బరువు పెరుగుతారు. బిడ్డకు పాలివ్వడం అనేది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు.
అంటే కాకుండా ఎక్సర్ సైస్  మరియు డయటింగ్ పాటించి  మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి 

బేస్డ్  ఆన్ http://www.prajasakti.com/Content/1759064

Tuesday, July 05, 2016

ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే

  I like this sentiment
  All this talk of Plagiarism is one created by copyrights holders, who have kept increasing the time a creater of  an essay /story/novel/fiction or nonfiction book should  keep getting  royalties.

 "FROM
JVRK PRASAD
who has done a good job on Telugu WIKI diabetes mellitus essay
  • నిన్ను ఏనాడూ ఎవరూ మెచ్చుకోరు, గుర్తించరు, అభినందించరు, ఇత్యాది వాటి కోసం ఏనాడూ పాకులాడకు, అలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు లభించవు.

  • ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే ! వ్యాసం పూర్తయితే అపురూప భవంతి కట్టినట్లే !! ఎన్నెన్నో శిల్పాలు, భవంతులున్నా కొన్ని మాత్రమే అజరామరం !!!
  • ఏ పని అయినా ఎలాగయినా చేయవచ్చును. కానీ దానిని కాస్త అందంగా ఆ పేజీని (పుటని) చూపించగలగితే చదువుకునే వారికి ఆహ్లాదముగా ఉంటుంది అని నా భావన. వికీ అంటేనే ఎవరు చేసిన పని శాశ్వతం కాదు. ఏ పని ఎవరికీ శాశ్వతం కాదు. ఏదీ ఎవరి సొంతం కాదు. వికీ అంటేనే స్వంతం అనేది ఏదీ లేదు. వికీ అంటేనే క్షణం క్షణం మారిపోయేది. అందువల్ల మనసులో నేను ఏమీ పెట్టుకోను. ఈ పని త్వరగా అయింది కొంతవరకైన అనే సంతృప్తి మిగిలితే, *నేను మరికొన్ని మంచి కొత్త విషయములతో కూడిన విద్యావిషయ సంబంధించినవి అందించుటకు సరస్వతిదేవి నా హస్తమునకు స్నేహము అందించగలదని ఆశిస్తాను.
  • నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు బిస్కత్తు ఇచ్చినట్లు ఒక వ్యాసం పూర్తి చేసిన తరువాత మరొకటి వ్రాయాలని తెలుకుంటే మంచిది.
  • I am definitely one of those who has done the same mistake(నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు)
  • ఇక్కడ వ్రాసే వ్యాసాలు అంతర్జాలంలో తెలుగులోనే ఎన్నో చోట్ల లభ్యమవుతాయి. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు వ్రాయడం ? తెలుగులో లేనివి కూడా ఇక్కడ వ్రాయకూడదంటాడు. ప్రతివాడు తను చెప్పేదే వినాలనుకుంటాడు, అదే వేదం అంటాడు. అదే వికీపీడియా మూలసూత్రం అంటాడు. దానికి పాత మరియు కొత్త అందరూ భజనలు చేస్తారు. గ్రూపులు కడతారు.
  • నువ్వు కోట్లమంది ప్రజల కోసం సొంతంగా పెద్ద పనులు గురించి ఒక్కడివే ఆలోచించి జీవితం లోని సమయాన్ని పాడుచేసుకోకు. పదిమందితో కలసి ఒకే ఒక వ్యాసంలో పాలుపంచుకుంటే గుర్తింపు ఉంటుంది.
  • నువ్వు వ్యాసాలకు పేర్లు మాత్రమే పెట్టానని ఎంతగా మెత్తుకున్న అవి వ్యాసాలు అనే ఎదుటి వారు అంటారు. వేల వ్యాసాలు ఒకేసారి నువ్వే పూర్తి చేస్తానంటావు, అందుకు ఒకరు మూస పెట్టాలంటారు. ఆ మూస అన్ని రోజులు, అన్ని వేల వ్యాసాలకు ఉండకూడ దంటారు. నీ ఆలోచనల విధానంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటవు. బొమ్మలు పెట్టడం దగ్గర కూడా అనేక విమర్శలు. ఒకరు మొలకలు తీయాలంటే ఎక్కడ తీసివేస్తారోనని జాబితాలో అందులో చేర్చావు. మరొకరు జాబితాలు ఉండకూడ దంటారు. జాబితాలు తీసివేసి మూసలు పెడతావు. మూసలు ఎక్కువయ్యాయని ఉండకూడదంటారు ఇంకొకరు. తెలుగు వారు నివశిస్తున్న చదువుకున్నవారు, అంతర్జాల అవగాహన ఉన్నవారి మాత్రం కోసమే తప్పితే, నువ్వు అనుకున్నట్లుగా దేశంలో, విదేశాలలో ఉన్న ఎటువంటి చదువు లేకపోయినా ప్రతి తెలుగు బిడ్డ కోసం తెలుగు సమాచారం అందించాలనుకునే నీ తపన, తాపత్రయం చాలా తప్పు అని వికీ మూల సూత్రాలు ద్వారా మరో ఇద్దరు పెద్దలు నీకు నీతులు చెప్పేందుకు రాకుండానే, త్వరగా నీవు తెలుసుకున్నందుకు మనసులోనే మంచిదయ్యిందని సంతోషించితే, నీకు ఆనందం మిగులుతుంది. ఇక్కడ ఉన్న పదిమంది అభిప్రాయాలు చెప్పినట్ట్లుగా ఇలా అందరికీ నీ పనిలో లోపాలే కనబడతూ ఉంటే ఆపనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలవు.
  • అడవిలోని సింహం ఎవరి బంధు మిత్రుల సహాయ సహాకారాలు తనకోసం ఏనాడూ కోరుకోదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి మనసుకు కష్టం కలిగించేవి వచ్చినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని విడవక అండగా అందుబాటులోనే ఉంచుకుంటే ధైర్యంగా ముందుకు నీ జీవిత ప్రయాణ పయనము సాఫీగా సాగుతుంది."