Sunday, July 31, 2016

కిడ్నీ కేర్ మీ చేతుల్లో‌నే

కిడ్నీ కేర్ మీ చేతుల్లో‌నే


               మూత్రపిండాలు (కిడ్నీ) శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రసాయనాలు, ఇతర హానికర పదార్థాలు, ద్రవాలన్నీ ఈ వడపోత ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అంతటి ప్రాధాన్యం కలిగిన కిడ్నీలో సమస్య వచ్చిందంటే చాలు జీవితకాలం పూర్తయినట్టేనని చాలామంది భావిస్తారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. తగిన చికిత్సలు చేయించుకుంటే ఈ వ్యాధిగ్రస్తులు అందరిలాగే సంపూర్ణ జీవితాన్ని కొనసాగించవచ్చు. వయస్సు మీద పడిన తర్వాత వచ్చే ఈ సమస్యలను ఒక పద్ధతి లేని ఆహార నియమాల వల్ల యుక్త యస్సులో కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అసలు మూత్రపిండాల వ్యాధులు ఏవిధంగా సోకుతాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి నుంచి ఎలా బయటపడాలి? ఆ క్రమంలో అందుబాటులోకి వచ్చిన నూతన చికిత్సలు ఏమిటి? అన్న విషయాలు ఈ వారం డాక్టర్స్‌ స్పెషల్‌లో తెలుసుకుందాం.
లక్షణాలు
కిడ్నీ వ్యాధి రావడానికి ముందుగా శరీరంలో కొన్ని ముఖ్యమైన సూచనలు కనిపిస్తాయి. వాటిని ప్రాతిపదికగా తీసుకుని వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకోవచ్చు. కాళ్లు, ముఖం వాపు, మూత్రవిసర్జన తగ్గడం, ఆకలి లేకపోవడం, ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపులో వికారంగా ఉండి వాంతి వచ్చినట్టుగా ఉండడం, పగటిపూటా ఇలాగే ఉండడంతోపాటు మగతగా ఉంటుంది. పగలు నిద్ర ఎక్కువగా రావడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం కిడ్నీ వ్యాధి లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు బ్లడ్‌ యూరియా క్రేట్‌ పరీక్ష చేయడం ద్వారా వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. కిడ్నీ ద్వారా బయటకు వెళ్లవలసిన వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయా లేదా అన్నది ఈ పరీక్ష ద్వారా తేలిపోతుంది. ఒకవేళ వ్యర్థ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయంటే దాన్ని కిడ్నీ వ్యాధిగా పరిగణించాలి. ఆ తర్వాత అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హిమోగ్లోబిన్‌ నివేదిక పరిశీలించి ఈ సమస్య దీర్ఘకాలంగా ఉందా లేక కొత్తగా వచ్చిందా అని తెలుసుకోవచ్చు. వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే మందులతో నయం చేసుకోవచ్చు. మందులతో నయం కానప్పుడు దాని తీవ్రత పెరుగుతుంది. కొందరికి అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్‌) దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వాటి ప్రభావం కిడ్నీలపై నెమ్మదిగా పడి వ్యాధి తీవ్రతరమవుతుంది.

రక్తశుద్ధి ఎప్పుడంటే...
ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అని ముందుగా నిర్ధారించుకున్న తర్వాత చికిత్స మొదలవుతుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే మందులు, ఆహార నియంత్రణ ద్వారా నివారించుకోవచ్చు. కాళ్లవాపు, ఆయాసం వంటి లక్షణాలు ఎక్కువగా ఉండి మందులు వాడుతున్నప్పటికీ మూత్ర పరిమాణం పెరగని పక్షంలో రక్తశుద్ధి (డయాలసిస్‌) చేయాల్సి వస్తుంది. ఆహార నియంత్రణతో శరీరంలో పొటాషియం పరిమాణం తగ్గని పక్షంలో అది గుండెపై ప్రభావం చూపుతుంది. మూత్రంలో యాసిడ్‌, యూరియా పరిమాణాలు పెరుగుతూ ఉంటే డయాలసిస్‌ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
వ్యాధి ఎందుకొస్తుందంటే...
కిడ్నీ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది కాగా రెండోది దీర్ఘకాలికంగా ఉండేది. తాత్కాలిక సమస్యకు అనవరసంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడడం, యాంటీ బయాటిక్‌లు అవసరమైనా, లేకపోయినా దీర్ఘకాలంగా తీసుకోవం, డీహైడ్రేషన్‌ వంటివి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయడం లాంటి ప్రధాన కారణాల వల్ల కిడ్నీల్లో సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి వాటిని అరికట్టడం ద్వారా వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుకునే వీలుంటుంది. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో అరవై నుంచి డభై శాతం మంది మధుమేహం కారణంగా సమస్యను ఎదుర్కొంటున్న వారే. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా నిరోధించకపోయినప్పటికీ కొంతవరకు జాప్యం చేయవచ్చు. ఒకవేళ వ్యాధి సోకినా డయాలసిస్‌ వరకు వెళ్లకుండా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవీ జాగ్రత్తలు
కుటుంబంలో ఎవరికైనా మధుమేహ వ్యాధి ఉన్నా కుటుంబ సభ్యులంతా ఏడాదికి ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి.
మధుమేహం, హైబీపీ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడంతోపాటు ఆహార నియంత్రణ పాటించాలి.
మందులు క్రమం తప్పకుండా వేసుకుంటూ షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి.
తద్వారా కిడ్నీ సమస్యలనుు కొంతకాలం వాయిదా వేయవచ్చు.
షుగర్‌ను నియంత్రించుకోని పక్షంలో వృద్ధాప్యంలో రావాల్సిన కిడ్నీ సమస్యలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది.
క్యాలరీలు అధికంగా ఉండే పిజ్జాలు, బర్గర్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఆల్కహాల్‌, ధూమపానం వంటి అలవాట్లు మానేయాలి.
నిత్యం వ్యాయామం చేయడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడంతోపాటు రోజుకు రెండు లీటర్ల నీరు తాగడం ద్వారా కిడ్నీ సమస్యలు రాకుండా అరికట్టవచ్చును.
కిడ్నీ శరీరంలో మురుగును వదిలించే వ్యవస్థ వంటిది. ఆ మురుగు బయటకు పోకుండా లోపల ఉండిపోతే శరీరం మొత్తం పాడైపోతుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, సోడియం, పొటాషియం తదితర లవణాలను నియంత్రించడం మూత్రపిండాల విధి. అందువల్ల బీపీ, రక్తహీనత వంటివి ఉన్నప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

రెండు విధాలుగా డయాలసిస్‌ 
కిడ్నీ వ్యాధి సోకిన రోగులకు ఒక్కోసారి డయాలసిస్‌ (రక్తశుద్ధి) అవసరమవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హిమో డయాలసిస్‌, రెండోది పెరిటోనియల్‌ డయాలసిస్‌.
హిమో డయాలసిస్‌
ఇది చేయించుకునే రోగులకు బీపీ సాధారణ స్థాయిలో ఉండాలి.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో బీపీ తక్కువగా ఉంటుంది.
ఇటువంటి రోగులకు సీఆర్‌ఆర్‌టీ (కంటిన్యూయస్‌ రీనల్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపి) అనే ఆధునిక యంత్రం ద్వారా డయాలసిస్‌ చేయవచ్చు.
ఈ చికిత్స దశల్లో కిడ్నీ విఫలమైతే దాని మార్పిడి విషయాన్ని రోగులకు చెప్పాల్సి ఉంటుంది.
పెరిటోనియల్‌ డయాలసిస్‌
పెరిటోనియల్‌ డయాలసిస్‌కు మరో పేరే హోం డయాలసిస్‌.
రోగులు హిమో డయాలసిస్‌ సెంటర్‌కు దూరంగా ఉన్న పక్షంలో
పెరిటోనియల్‌ డయాలసిస్‌ విధానాన్ని ఉపయోగిస్తారు.
ఈ విధానంలో యంత్రం అవసరం ఉండదు.
ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు.
పచ్చకామెర్లు ఉన్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా
ఉంటుంది.
దీనికి రక్తంతో సంబంధం ఉండదు.
హిమో డయాలసిస్‌లో బీపీ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల రికవరీ
అవకాశాల్లో పది నుంచి ఇరవై శాతం వరకు రిస్క్‌ ఉంటుంది.
ఆరేడు గంటలకు ఒకసారి మూత్రంతో నిండిపోయిన బ్యాగ్‌ను
మారుస్తుండాలి.
ఇది నెమ్మదిగా పనిచేయడంతో బీపీలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం లేదు.
హిమో డయాలసిస్‌ కంటే ఇది ఎంతో ఉపయోగకరమైనది.
- డాక్టర్‌ కె.ఎస్‌.నాయక్‌, 
నెఫ్రాలజిస్ట్‌, 
హైదరాబాద్‌.

మధుమేహానికి ప్రధాన కారణాలు

              నగరీకరణ, ఆహారంలో మార్పులు, జీవన ప్రమాణం పెరగడం, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మధుమేహం ఇటీవల కాలంలో మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మన దేశం నిలవబోతుందనడంలో నిజం లేకపోలేదు. సుమారు 50 మిలియన్లకుపైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారని, ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకు పెరగవచ్చని ఆరోగ్య నిపుణుల అంచనా. నష్టం జరిగిన తరువాతగానీ దీని అసలు రూపం బయటపడదు. కాబట్టి దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. ఈ నెల 14న 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' సందర్భంగా పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసం. మధుమేహం ఉందన్న సంగతి 50 శాతం మందికి పైగా వ్యాధిగ్రస్తులు గుర్తించ లేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకొంటున్నారు. మధుమేహం వలన నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్లు, పాదాలు వంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పనిసరి తెలుసుకుని, దాని నుండి రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. 
కారణాలు
కుటుంబంలో తల్లిదండ్రులకు మధుమేహం ఉన్నా, అధికబరువు, ఊబకాయం ఉన్నవారికి, ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వారికి, ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వారికి ఈ మధుమేహం వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవారు, నాలుగు కిలోల బరువున్న శిశువులకు జన్మనిచ్చిన స్త్రీలు, స్టెరాయిడ్స్‌ తీసుకునే వారికి రావచ్చు. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే 99 శాతం వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల బంధువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే 75 శాతం వచ్చే అవకాశం ఉంది. బంధువులు ఎవరికైనా మధుమేహం ఉంటే 50 శాతం, తల్లిదండ్రులకు కాకుండా దగ్గర బంధువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే 25 శాతం మందికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పరీక్షలు 
మధుమేహం నిర్ధారణకు సంబంధించి ఈ కింది పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఫాస్టింగ్‌, పోస్ట్‌ లంచ్‌ బ్లడ్‌ షుగర్‌ ప్రతి నెలా చేయించుకోవాలి. గ్లైకోజిలేటెడ్‌ హెమోగ్లోబిన్‌ (హెచ్‌బిఎ1సి) టెస్ట్‌లు రెండు మూడు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. లిఫిడ్‌ ప్రొఫైల్‌ సంవత్సరానికి ఒకసారి, కిడ్నీ పరీక్షలు యూరియా, క్రియాటినైన్‌ ఆరు నెలలకు ఒకసారి, మెక్రో అల్బుమిన్‌ సంవత్సరానికి ఒకసారి, గుండె, లివర్‌, పాదాలను సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. కన్ను రెటీనా గురించి పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. బ్లడ్‌ షుగర్‌ పరీక్షలతో పాటు ప్రతి సంవత్సరం కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాల పరీక్షలను చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. 
లక్షణాలు
తరచుగా మూత్ర విసర్జన చేయడం, అతిగా దాహం, ఆకలి వేయడం, బరువు తగ్గిపోవడం, చూపు మందగించడం, పుండ్లు త్వరగా మానకపోవడం, బాగా నీరసం, నిస్సత్తుగా ఉండటం, మర్మావయవాల వద్ద ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఆహార నియమాలు పాటించాలి

ఆహార నియమాలు పాటించాలి
పిజ్జా, బర్గర్‌, ఫైడ్‌రైస్‌, న్యూడిల్స్‌ వంటి ఫుడ్స్‌, నిల్వచేసిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, మసాలా పుడ్స్‌ తినడం ద్వారా ఒబిసిటి థైరాయిడ్‌, సుగర్‌, అధికబరువు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక మనిషి రోజుకి 1600 నుంచి 1800 క్యాలరీలు ఆహార పదార్థాలుగా తీసుకోవాల్సి ఉంది. 2000 నుంచి 2,500 క్యాలరీలు తీసుకుంటున్నారు. 
శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి
ప్రస్తుత సమాజంలో బిజిబిజీగా ఉండే ప్రజలు శారీరక శ్రమ, వ్యాయామం చేయడానికి విస్మరిస్తున్నారు. గతంలో పురుషులు, మహిళలు రోజుకు కొంత సమయాన్ని తోటల్లో మొక్కలు పెంపకం, ఇళ్లల్లో తేలికపాటి పనులు చేస్తూ శారీరకంగా శ్రమించేవారు. ప్రజల జీవనవిధానంలో మార్పులు, యాంత్రికరణతో శారీరక శ్రమ జోలికి పోవడం లేదు. ఆధునిక కాలంలో వ్యాయామం చేయడానికి సరిగ్గా సమయం దొరకడం లేదు. వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ప్రతి మనిషీ రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు నడవాలి. ప్రజలు వారానికి ఐదురోజులు 45 నిమిషాలు పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
మానసిక ఒత్తిడికి దూరంగా
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, ఆయాసం, థైౖరాయిడ్‌ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడిలకు దూరంగా ఉండాలంటే యోగా, మెడిటేషన్‌ చేయాలి. 
మధుమేహ వ్యాధిపై అవగాహన
ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మధుమేహంపై అవగాహనకు పిలుపు నిచ్చారు. మధుమేహ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించొచ్చు. మధుమేహ వ్యాధి భారం, దాని పరిణామాలు, వ్యాధి పరివీక్షణ, నివారణ మార్గాలు, మధుమేహ రోగులకు సమర్థ వంతమైన చికిత్సలపై ప్రభుత్వాలను సన్నద్ధులను చేయాలి.
శారీరక శ్రమ, వ్యాయామం తప్పనిసరి
ప్రస్తుతం కాలంలో ప్రజలు బిజిగా ఉంటున్నారు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండడం ద్వారా భావితరాలకు ఆరోగ్యాన్ని అందించొచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు మధ్యంతరం రాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబం రోజుకి గంటసేపు కుటుంబ సభ్యులతో గడపాలి. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలి. భావి తరాలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. 
డాక్టర్‌ మోకా ప్రసాదరావు, వైద్య నిపుణులు, రాజోలు

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే హానికరం

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
    'మీకు తెలుసా.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 350 మిల్లియన్ల జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారిలో తొమ్మిది శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారిలో 92 మిలియన్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, 62 మిలియన్ల బాధితులతో మన దేశం రెండో స్థానంలో ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలయ్యాయి'. 
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో మధుమేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు, పనిఒత్తిడి, వారసత్వం ఇలా పలురకాల కారణాలు ఈ వ్యాధిబారిన పడేలా చేస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఈనెల ఏడో తేదీన ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశంపై ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఈ విధంగా 1950 నుంచి ప్రతిఏటా ఇలా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఏడాది 'హాల్ట్‌ ది రైజ్‌ - బీట్‌ డయాబెటిస్‌' ( ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుందాం - మధుమేహ వ్యాధిని జయిద్దాం) అనే నినాదంతో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధిపై ప్రజాశక్తి అందించే ప్రత్యేక కథనం
రక్తంలో గ్లూకోజ్‌ శాతం సాధారణం కన్నా ఎక్కువుగా ఉన్నా తక్కువుగా ఉన్నా దాన్ని మధుమేహం అంటారు. ఇందులో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుగా చెబుతారు. టైప్‌-1 ప్రకారం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు ప్రాంకియస్‌లో నాశనం అవ్వడం వల్లలో శరీరంలో చక్కెరపై నియంత్రణ కోల్పోతోంది. దీనిబారిన పడిన వారు జీవితకాలం ఇన్సులిన్‌ వినియోగించాలి. టైప్‌-2 జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల వస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతున్నా నియంత్రణ చేసే సామర్థ్యం సరిపోకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడతారు. దీనికి మందులను వినియోగించాలి. మధుమేహం గుండె, రక్తనాళాలు, కీళ్లు, కళ్లు, నాడీవ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మృతిచెందుతున్నారు. అదేవిధంగా కిడ్నీలు పాడైపోవడం, చూపు మందగించడం, నరాల దెబ్బతినడం వంటి ఎన్నో రోగాల బారిన పడతారు. 
నియంత్రించండి ఇలా..
మన జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటుగా నిత్యం వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మధుమేహ వ్యాధిని దరిచేరకుండా చూడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. వీటికితోడుగా మద్యపానం, దూమపానం వంటి అలవాట్లాకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ మధుమేహ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రచారం చేయాలనుకున్నా ముందుగా ఆ వ్యాధికి కారణాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సి ఉంది. వ్యాధికి మూలాలను గుర్తించి దాన్ని నిర్మూలించే దిశగా చర్యలు చేపడితే దానికి తగిన ఫలితం ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం, కాలుష్యం వంటి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. దానికి తగినట్లుగానే అధికారులను కూడా అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. 
వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన ముఖ్యం
రావి గోపాలకృష్ణయ్య, ప్రముఖ వైద్య సలహా నిపుణులు
వ్యాధుల నియం త్రణకు చర్యలు చేపట్టడే కాదు.. దానిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే వ్యాధులను నియంత్రించొచ్చు. ప్రభుత్వాసు పత్రుల్లో సేవలు మరింత మెరుగుపడాలి. నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలి. 
కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత
ఎం.నాగార్జున, పర్యావరణ ఇంజినీరు,
కాలుష్య నియంత్రణ మండలి 
వాతావరణంలో కార్బ న్‌డై ఆక్సైడ్‌ ఎక్కువుగా కలవడం వల్ల ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. దీనివల్ల ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాతావరణం కలుషితం కాకుండా చూడల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ విషయాన్ని గుర్తించాలి.

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!


                   మధుమేహం ఉందని తెలియగానే దిగులుపడతాం. ఆ దిగులు, ఆందోళన, టెన్షన్లే ఈ వ్యాధిని మరింత పెంచుతాయి కానీ, తగ్గించవు. ఈ వ్యాధి గురించిన పూర్తి చికిత్సా విధానం తెలియకపోవడం వల్లే ఇలా ఆందోళనపడటం సహజం. అది గ్రహించిన వి.జి.ఆర్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ కె. వేణు గోపాల్‌రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడే వారికోసం, వారంతా ఆరోగ్యంగా జీవించడం కోసం కొన్ని అవగాహనా కార్యక్రమాలను రూపొందించారు.
షుగర్‌ను ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి? ఇది ప్రాణాంతకమవకుండా ఏం చేయాలి? షుగర్‌వల్ల దెబ్బతినే అవయవాలను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఆహార నియమాలు ఎలా ఉండాలనే అతి ముఖ్యమైన విషయాలు తెలియజెప్పారు. ఆ వివరాలు 'జీవన' పాఠకులకు ప్రత్యేకం.
మధుమేహ వ్యాధి ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ మధుమేహ నగరంగా ముందుందుని సర్వే తెలుపుతోంది. చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకి పైగా ఇప్పటికే మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా.
దురదృష్టం కొద్దీ మధుమేహ వ్యాధి లక్షణాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు. అందుకే దానిని అంతగా పట్టించుకోం. నష్టం జరిగిన తరువాతగానీ అసలు వాస్తవం బయటపడదు. కాబట్టే దీనిని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు.
మధుమేహం ఉందనేది, ఉన్నవాళ్లకు 50 శాతం మందికి తెలియనే తెలియదు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. మధుమేహం వల్ల నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్ర పిండాలు, కళ్లు, పాదాల్లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పక తెలుసుకొని, దాని నుంచి రక్షణ పొందాలి.
రావడానికి ఎవరికి అవకాశం ఉంది?
కుటుంబంలో తల్లిదండ్రులకు ముధుమేహం ఉంటే
అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లు
ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు
ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వాళ్లు
కొలెస్ట్రాల్‌ (లేక) ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లు
నాలుగు కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్త్రీ
స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవాళ్లకు
రిస్క్‌ ఎలా ఉంటుంది?
తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే-99%
తల్లిదండ్రులో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే -75%
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే - 50%
తల్లిదండ్రులకుగాక దగ్గర బంధువులకెవరికైనా
మధుమేహం ఉంటే -25%
చేయించుకోవలసిన పరీక్షలు
ఫాస్టింగ్‌, పోస్ట్‌లంచ్‌ బ్లడ్‌షుగర్‌ - నెలకోసారి
గ్లైకోజిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ - 2-3 నెలలకోసారి
లిఫిడ్‌ప్రొఫైల్‌ - సంవత్సరానికి ఒక్కసారి
కిడ్నీ పరీక్షలు - యూరియా, క్రియాటినైన్‌,
ఆరు నెలలకు ఒకసారి
మైక్రో ఆల్బుమిన్‌ - సంవత్సరానికి ఒక్కసారి
గుండె, లివర్‌, పాదాలను - సంవత్సరానికి ఒక్కసారి
కన్ను- రెటీనా గురించి - సంవత్సరానికి ఒక్కసారి
కేవలం బ్లడ్‌ షుగర్‌ పరీక్షలు చేయిస్తే చాలదు. ప్రతీ ఏడాది కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాలు పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తపడాలి.
ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి మధుమేహం అదుపులో లేనివాళ్లలో ఈ అవయవాలు నిశబ్ధంగా దెబ్బతింటాయి. అది బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
వ్యాధి లక్షణాలు
తరచుగా మూత్ర విసర్జన చేయడం
అతిగా దాహం వేయడం
అతిగా ఆకలి వేయడం
బరువు తగ్గిపోవడం
చూపు మందగించడం
పుండ్లు త్వరగా మానకపోవటం
బాగా నీరసం, నిస్సత్తువ
మర్మావయవాల దగ్గర ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడం
తెలుసుకోవడానికి
ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ -126mg/dl ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌లో బ్లడ్‌షుగర్‌ 75mg  గ్లూకోజ్‌ తీసుకున్న రెండుగంటలకు 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్న మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
అలాగే రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
ఫాస్టింగ్‌ బ్లడ్‌షుగర్‌ 100`125 mg/dl మధ్య, ఆహారం తీసుకున్న తరువాత 140 mg/dl- 199 mg/dl ఉన్నవాళ్లని ప్రీ డయాబెటిక్‌ స్టేజీలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు. వీళ్లకు భవిష్యత్‌లో షుగర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
గుండెజబ్బులు
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 50-60 శాతం మంది గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో భాదపడుతున్నట్లు పరీక్షలు తెలుపుతున్నాయి. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడుతూ మరణించిన వాళ్లల్లో మూడు వంతులు గుండెనాళాలకు సంబంధించిన వ్యాధుల కారణాల వల్లే అని పరిశోధనల్లో తేలింది.
మూత్రపిండాలు
మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేకుండా ఉంటే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడవచ్చు. మూత్రపిండాలకు డయాబెటిక్‌ నెఫ్రోపతి వస్తుంది. ఇది వస్తే క్రమంగా మూత్రపిండాలు పాడైపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతోనే డయాబెటిక్‌ నెఫ్రోపతిని అదుపులో ఉంచుకోవచ్చు.
పాదాలు
మధుమేహం వల్ల క్రమంగా రక్తనాళాలే కాదు, నరాలూ దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరం చివర ఉండే నరాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహమంటే పెరిఫెరల్‌ న్యూరోపతి వస్తుందని భయపడుతుంటారు. పాదాలలో, అరచేతుల్లో ఉన్న నరాలు, దెబ్బతినే ముందు తిమ్మిర్లు వస్తాయి. ఆ తర్వాత స్వర్మజ్ఞానం క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు పాదాలలో ఏమి గుచ్చుకున్నా తెలీదు.
కన్ను
మధుమేహం అదుపులో లేనివారిలో ముందుగా కన్ను వెనుకఃభాగంలో ఉండే రెటీనా అనే పొరలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినటం జరుగుతుంది. దానివలన చివరకు అంధత్వం కూడా సంభవించవచ్చు.
చికిత్స
మధుమేహం వ్యాధి చికిత్సలో నాలుగు ముఖ్యమైన అంశాలను మనం తప్పకుండా పాటించాలి. అందులో
మొదటిది:
సరైన ఆహార నియమాలను పాటించడం.
రెండవది:
రెగ్యులర్‌గా వ్యాయమం చేయడం.
మూడవది:
క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం.
నాల్గవది:
వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం.
పైన చెప్పిన ఈ నాలుగు అంశాలను చక్కగా పాటించడం ద్వారా మనం మధుమేహం వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోగలం. దీనివల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి వీలు కలుగుతుంది.

http://www.prajasakti.com/Content/1655505

దేశంలో తీవ్ర సమస్యగా మధుమేహం

                      మధుమేహం ప్రపం చాన్ని భయపెడుతోంది. అది అత్యంత వేగంగా పెరుగు తున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతున్న ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసు కొని ఈ ఏడాది మధుమేహాన్ని తరిమికొడదామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారు. మరో 20 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింప వుతుందని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిం చింది. 2012లో కోటిన్నరమంది కేవలం మధు మేహం వల్లే మరణించారు. ఇందులో 80 శాతం అల్ప, మధ్యా దాయం గల దేశాల్లోనే ఉంది. 1990 నుంచి 2013 వరకు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 45 శాతం పెరిగితే భారత్‌లో అది 123 శాతమని వాషింగ్టన్‌ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధ కులు చేసిన ఓ అధ్యయనం తేల్చింది. స్థూలకాయం, నిద్ర లేమి, మూత్రపిండాల జబ్బు లు, పక్షవాతం, గుండెపోటు వంటి పలురకాల వ్యాధులకు కారణమయ్యే పది అంశాలలో మధుమేహం కూడా చేరింది. 1990లలో తొలి పది వ్యాధుల జాబితాలో లేని మధుమేహం 2013 నాటికి 8వ స్థానంలో నిలిచింది.
దేశంలో తీవ్ర సమస్యగా మధుమేహం
మన దేశం 'ప్రపంచ మధుమేహ రాజధాని 'గా మారిం ది. భారత్‌లో అకాల మరణాలకు చాలా వరకు మధుమేహం, రక్తపోటు లాంటి సాంక్రమికేతర వ్యాధులే కారణమవుతున్నా యని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2011 అంచనాల ప్రకారం 20-79 సంవత్సరాల వయస్సు కలిగిన 6,13,00,000 మంది ప్రజల్లో మధుమేహం ఉంది. ఇది 2030 నాటికి 10,12,00,000 చేరుకుంటుందని అంచనా. మారుతున్న జీవనశైలిలో భోజనపు అలవాట్లు దీనికి కారణమౌతున్నాయి. వంశపారంపర్యం, జన్యు సంబం ధిత అంశాలు, వ్యాయామం లేకపోవటం, వయసు పైబడ టం లాంటి అంశాలు మధు మేహాన్ని వ్యాపింపజేస్తున్నాయి. 2001లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్‌లలో 'నేషనల్‌ అర్బన్‌ డయాబెటిక్‌ సర్వే' జరి గింది. దీని ప్రకారం 2001లో దేశంలో మధుమేహ సగటు 12 శాతంగా ఉంది. ముంబాయి, ఢిల్లీలో 9 శాతం ఉంటే దక్షిణభారత దేశ నగరాలలో 13-15 శాతం ఉంది. అంతే కాక ఆరు మెట్రో నగరాలలో హైదరాబాద్‌లోనే ఇది ఎక్కువ. ఇక్కడ సగటు మధుమేహం 16 శాతం వుంది. ముఖ్యంగా పట్టణ పేదలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతి నలుగురు పట్టణ పేదలలో ఒకరికి మధుమేహం ఉంది.
రెెండు తెలుగు రాష్ట్రాల్లో...
రెెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమేహం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మన విద్యావ్యవస్థ కూడా రోగాలకు కారణమౌతోంది. పిల్లలు అందమైన బాల్యాన్ని, ఆటపాటలను పూర్తిగా కోల్పోతున్నారు. వాటి స్థానే ఎంతసేపూ చదువు, హోంవర్కులు, ట్యూషన్లు లేదా టీవీ, కంప్యూటర్లు చూడటంతోనే బాల్యం గడిచిపోతోంది. ఇక ఇంటర్మీడియెట్‌ విద్యావిధానం కట్టుబానిసత్వానికి ప్రతీక. తల్లిదండ్రులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విధానాన్ని సమర్థించి ఆచరిస్తున్నారు. ఈవిధానం విద్యా ర్థుల్లో అపరిమితమైన మానసిక ఒత్తిడి, అభద్రతాభావం, అనారోగ్యకరమైన పోటీతత్వం పెంపొందిస్తున్నాయి. ఒక వైపు పోషకాహారం అందక కోట్ల మంది బాలలు బక్కచిక్కి పోతున్న దేశంలోనే స్థూలకాయంతో అవస్థలు పడుతున్న వారి సంఖ్య పది శాతం దాటిపోయి మరింత వేగంగా పెరుగుతున్న తీరు భయాందోళనలను కలిగిస్తోంది.
యువతలో మధుమేహం
యువత మధుమేహం బారిన పడుతోంది. ఈ వయసులో మాకెందుకు వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ సుగర్‌ క్లినిక్స్‌కు చెందిన 34 శాఖల్లో 2015 నవంబరు నుంచి 2016 జనవరి వరకు నిర్వహించిన ర్యాండమ్‌ బ్లడ్‌ స్క్రీనింగ్‌ క్యాంపుల ద్యారా చేసిన అధ్యయ నంలో ముఖ్యంగా మధుమేహం బారిన పడిన యువత 22.78 శాతం ఉంది. ఈ సర్వేలో మొత్తం 37,075 మందికి పరీక్షలు చేశారు. అందులో 7,839 మందికి మధుమేహం ఉన్నట్టు నిర్థారణ అయ్యింది. వయస్సుల వారీగా నాలుగు వర్గాలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. 31-40 సంవత్సరాల వారిలో 22.78 శాతం, 41-50 మధ్య 21.16 శాతం, 51-60 మధ్య 22.97 శాతం, 60 పైబడినవారిలో 29.99 శాతం మందికి ఉంది. తీసుకొనే ఆహారంలో తీవ్రమైన మార్పులు రావడం, శారీరక శ్రమ బాగా తగ్గిపోవ డం వంటి కారణాలతో గ్రామీణ, నగర పంచాయతీ ప్రాంతా లలో స్థూలకాయం, మధుమేహం పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ లాంటి సంస్థల్లో, అవుట్‌సోర్సింగ్‌ పేరులో పనిచేసే ఉద్యో గులు రోజుకు 12 గంటలు పనిచేస్తూ యంత్రాలుగా తయారవుతున్నారు. విపరీతమైన ఒత్తిడితో మధుమేహాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మధుమేహం వల్ల స్త్రీపురుషుల్లో చాలా తక్కువ వయస్సులోనే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది యువతీయువకులు చిన్న వయస్సులోనే గుండె జబ్బులు, నాడీ జబ్బులు,కీళ్ళ నొప్పులను ఎదుర్కోవడానికి కూడా ఇదే కారణమని చెప్పవచ్చు.
భారతీయుల్లోనే ఎక్కువ
ఆసియా దేశవాసులు ముఖ్యంగా భారతీయుల శరీరాకృతిని పాశ్చాత్య దేశాల ఆకృతితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అమెరికన్లు, యూరోపియన్లు బరువు పెరిగిన ప్పుడు కొవ్వు శరీరమంతా ఒకే విధంగా విస్తరిన్తుంది. దీన్ని జనరలైజ్డ్‌ ఒబెసిటి అంటారు. ఆసియన్లలో ముఖ్యంగా భారతీయుల్లో కొవ్వు పొట్ట, నడుం భాగంలోనే పెరుగు తుంది. దీన్ని సెంట్రలైజ్డ్‌ ఒబెసిటి అంటారు. దీంతో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఇంకా ఎక్కువౌతుంది. జనరలైజ్డ్‌ ఒబెసిటీ కంటే సెంట్రలైజ్డ్‌ ఒబెసిటి మరింత ప్రమాదం. అంతేకాక మన దేశస్తుల్లో మధుమేహానికి కారణమయ్యే జన్యువులు కూడా ఎక్కువే ఉన్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచ దేశాల అప్రమత్తత
సాంక్రమికేతర వ్యాధులు ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్‌ లాంటి వ్యాధులు మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న వాస్తవం అవగతం కాగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. 2003 మేలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ఈ వ్యాధుల కట్టడికి కార్యాచరణ రూపొందించింది. జాతీయ స్థాయి నుంచి ప్రపం చ స్థాయి దాకా భాగస్వామ్యం ఏర్పరచాలని, సమగ్ర నివారణ చర్యల దిశగా ముందడుగు వేయాలని అది నిర్ణయించింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సాంక్రమికేతర వ్యాధుల నియం త్రణపై 2011 ఏప్రిల్‌లో మాస్కోలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ మంత్రిత్వశాఖల స్థాయి సదస్సు అనారోగ్య ఆహార అలవాట్లను, సోమరితనాన్ని, హానికర ఆల్కహాలు వినియోగాన్ని నిరోధించాలని పిలుపునిచ్చింది. అదే ఏడాది సెప్టెంబరులో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సాంక్రమికేతర వ్యాధుల అదుపుకు అనువైన వాతా వరణం కల్పిస్తామని, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొంది స్తామని అభయమిచ్చింది. ఈ బాటలో ఆస్ట్రేలియా, బ్రిటన్‌, బ్రెజిల్‌ లాంటి దేశాలు అనేక చర్యలు తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు లాంటి సాంక్రమికేతర జబ్బుల్ని అరికట్టగలిగాయి.
నివారణే కీలకం
మధుమేహం లాంటి సాంక్రమికేతర వ్యాధులు ఒకసారి వచ్చాక నయమయ్యే పరిస్థితి ఉండదు.ఈ వ్యాధులు దీర్ఘకాలికమైనవి, ఖరీదైన చికిత్స అవసరమైనవి. ఇప్పటికే చాలామంది పేదలు మధుమేహాన్ని గుర్తించడంలోనూ, గుర్తించిన తర్వాత మందులు వాడటంలోనూ తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారు. దీని దృష్ట్యా ప్రభుత్వం నివారణా చర్యల మీదనే ఎక్కువ దృష్టి సారించాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి కొన్ని అంశాల బాధ్యత సమాజం తీసుకోవాలి. ఈ రెండింటితో పాటు ప్రజలు కూడా ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వ్యాధి కారకం సామా జిక జీవనంలో ఇమిడిపోతుందో అప్పుడు ఆ సమస్య చికిత్స ద్వారా నయమయ్యే సాధారణ స్థాయిని దాటి ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. ఇటువంటి సమస్యలకు సామా జిక పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. భారత దేశంలో ఆరోగ్య పరిరక్షణకై చేసే ఖర్చులో 82 శాతం ప్రజల జేబుల్లోంచి ఖర్చవడం గమనార్హం. ప్రజారోగ్యంపై ప్రభుత్యం చేస్తున్న వ్యయం స్థూల జాతీయాదాయంలో 1.1 శాతం మాత్రమే. ఇది కనీసం 3 శాతంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. సమానత్వంతో కూడిన ప్రజారోగ్యవ్యవస్థ మన లక్ష్యం. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసినప్పుడు అసమానతలు లేని అభివృద్ధి సాధ్యం. తద్వారా ఆరోగ్య సూచికలు మెరగవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సమానత్వంతో కూడిన ఆరోగ్యాభివృద్ధి కోసం కృషిచేస్తాయని ఆశిద్దాం.
- డాక్టర్‌ రమాదేవి మీసరగండ
(వ్యాసకర్త జనవిజ్ఞానవేదిక ఆరోగ్య సబ్‌కమిటీ కన్వీనర్‌)
సెల్‌ : 9490300863

గర్భిణీల్లో మధుమేహ సమస్య జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes )

                    నేడు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే. ఇంకా భూమిపై పడని అమ్మకడుపులోని పాపాయి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపేంతగా. గర్భిణుల్లో వచ్చే మధుమేహం కొంతమందిలో ప్రసవం తర్వాత దూరమవుతుంది. మరికొందరిలో ప్రసవం తర్వాత కూడా కొనసాగుతుంది. ఈ అంశంపై అంతర్జాతీయస్థాయిలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దీని నియంత్రణకు గర్భిణీల్లో వచ్చే మధుమేహం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి.
గర్భిణీల్లో మధుమేహం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. కాబోయే అమ్మ గర్భం దాల్చి 24 వారాలు నిండిన తర్వాత తప్పనిసరిగా ఓరల్‌ గ్లూకోజ్‌ టోరెన్స్‌ టెస్ట్‌ (ఓజిటిటి/OGTT ) చేయించుకోవాలి. ఫాస్టింగ్‌ షుగర్‌ పరీక్షలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 90 కన్నా ఎక్కువ, పోస్టుప్రాండియాల్ షుగర్‌ పరీక్షలో 140 కన్నా ఎక్కువగా ఉన్నా జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes ) అంటారు. ఇందుకు కారణాలు ప్రధానంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉన్నవారు ఆహార మార్పులతో పాటు అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు ఇన్సులిన్‌ వాడవలసి ఉంటుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వల్ల రెండు ప్రధాన సమస్యలు వస్తాయి. అవి ఒకటి గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరుగుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు వస్తాయి. రెండు శిశువుకు గర్భంలో షుగర్‌ అలవాటు కావడం వల్ల డెలివరీ అయిన వెంటనే శిశువు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. పాపాయిని ఐసియులో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లికి ప్రెగెన్సీలో డయాబెటిస్‌ వస్తే బిడ్డకు డయాబెటిస్‌ వస్తుందని చాలా మంది భయపడతారు. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భిణీలకు డయాబెటిస్‌ ఉంటే పిల్లలకు  వెంటనే రాదు. జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ఉన్నవారిలో ప్రసవం తర్వాత డయాబెటిస్‌  మామూలుగా తగ్గిపోతుంది. అయితే వీరిలో యాభై శాతం మందికి నాలుగైదు సంవత్సరాల్లో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
జాగ్రత్తలు
ప్రసవం తర్వాత సరైన ఆహారం తీసుకోనివారిలో, ఆహారపు నియమాలు పాటించని వారిలో త్వరగా డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రసవం తర్వాత బరువు తగ్గుతారు. కొంతమంది మాత్రం మొదటి మూడునెలలు బరువు తగ్గి ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు పాలివ్వని తల్లులు బరువు పెరుగుతారు. బిడ్డకు పాలివ్వడం అనేది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు.
అంటే కాకుండా ఎక్సర్ సైస్  మరియు డయటింగ్ పాటించి  మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి 

బేస్డ్  ఆన్ http://www.prajasakti.com/Content/1759064

Tuesday, July 05, 2016

ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే

  I like this sentiment
  All this talk of Plagiarism is one created by copyrights holders, who have kept increasing the time a creater of  an essay /story/novel/fiction or nonfiction book should  keep getting  royalties.

 "FROM
JVRK PRASAD
who has done a good job on Telugu WIKI diabetes mellitus essay
  • నిన్ను ఏనాడూ ఎవరూ మెచ్చుకోరు, గుర్తించరు, అభినందించరు, ఇత్యాది వాటి కోసం ఏనాడూ పాకులాడకు, అలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు లభించవు.

  • ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే ! వ్యాసం పూర్తయితే అపురూప భవంతి కట్టినట్లే !! ఎన్నెన్నో శిల్పాలు, భవంతులున్నా కొన్ని మాత్రమే అజరామరం !!!
  • ఏ పని అయినా ఎలాగయినా చేయవచ్చును. కానీ దానిని కాస్త అందంగా ఆ పేజీని (పుటని) చూపించగలగితే చదువుకునే వారికి ఆహ్లాదముగా ఉంటుంది అని నా భావన. వికీ అంటేనే ఎవరు చేసిన పని శాశ్వతం కాదు. ఏ పని ఎవరికీ శాశ్వతం కాదు. ఏదీ ఎవరి సొంతం కాదు. వికీ అంటేనే స్వంతం అనేది ఏదీ లేదు. వికీ అంటేనే క్షణం క్షణం మారిపోయేది. అందువల్ల మనసులో నేను ఏమీ పెట్టుకోను. ఈ పని త్వరగా అయింది కొంతవరకైన అనే సంతృప్తి మిగిలితే, *నేను మరికొన్ని మంచి కొత్త విషయములతో కూడిన విద్యావిషయ సంబంధించినవి అందించుటకు సరస్వతిదేవి నా హస్తమునకు స్నేహము అందించగలదని ఆశిస్తాను.
  • నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు బిస్కత్తు ఇచ్చినట్లు ఒక వ్యాసం పూర్తి చేసిన తరువాత మరొకటి వ్రాయాలని తెలుకుంటే మంచిది.
  • I am definitely one of those who has done the same mistake(నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు)
  • ఇక్కడ వ్రాసే వ్యాసాలు అంతర్జాలంలో తెలుగులోనే ఎన్నో చోట్ల లభ్యమవుతాయి. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు వ్రాయడం ? తెలుగులో లేనివి కూడా ఇక్కడ వ్రాయకూడదంటాడు. ప్రతివాడు తను చెప్పేదే వినాలనుకుంటాడు, అదే వేదం అంటాడు. అదే వికీపీడియా మూలసూత్రం అంటాడు. దానికి పాత మరియు కొత్త అందరూ భజనలు చేస్తారు. గ్రూపులు కడతారు.
  • నువ్వు కోట్లమంది ప్రజల కోసం సొంతంగా పెద్ద పనులు గురించి ఒక్కడివే ఆలోచించి జీవితం లోని సమయాన్ని పాడుచేసుకోకు. పదిమందితో కలసి ఒకే ఒక వ్యాసంలో పాలుపంచుకుంటే గుర్తింపు ఉంటుంది.
  • నువ్వు వ్యాసాలకు పేర్లు మాత్రమే పెట్టానని ఎంతగా మెత్తుకున్న అవి వ్యాసాలు అనే ఎదుటి వారు అంటారు. వేల వ్యాసాలు ఒకేసారి నువ్వే పూర్తి చేస్తానంటావు, అందుకు ఒకరు మూస పెట్టాలంటారు. ఆ మూస అన్ని రోజులు, అన్ని వేల వ్యాసాలకు ఉండకూడ దంటారు. నీ ఆలోచనల విధానంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటవు. బొమ్మలు పెట్టడం దగ్గర కూడా అనేక విమర్శలు. ఒకరు మొలకలు తీయాలంటే ఎక్కడ తీసివేస్తారోనని జాబితాలో అందులో చేర్చావు. మరొకరు జాబితాలు ఉండకూడ దంటారు. జాబితాలు తీసివేసి మూసలు పెడతావు. మూసలు ఎక్కువయ్యాయని ఉండకూడదంటారు ఇంకొకరు. తెలుగు వారు నివశిస్తున్న చదువుకున్నవారు, అంతర్జాల అవగాహన ఉన్నవారి మాత్రం కోసమే తప్పితే, నువ్వు అనుకున్నట్లుగా దేశంలో, విదేశాలలో ఉన్న ఎటువంటి చదువు లేకపోయినా ప్రతి తెలుగు బిడ్డ కోసం తెలుగు సమాచారం అందించాలనుకునే నీ తపన, తాపత్రయం చాలా తప్పు అని వికీ మూల సూత్రాలు ద్వారా మరో ఇద్దరు పెద్దలు నీకు నీతులు చెప్పేందుకు రాకుండానే, త్వరగా నీవు తెలుసుకున్నందుకు మనసులోనే మంచిదయ్యిందని సంతోషించితే, నీకు ఆనందం మిగులుతుంది. ఇక్కడ ఉన్న పదిమంది అభిప్రాయాలు చెప్పినట్ట్లుగా ఇలా అందరికీ నీ పనిలో లోపాలే కనబడతూ ఉంటే ఆపనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలవు.
  • అడవిలోని సింహం ఎవరి బంధు మిత్రుల సహాయ సహాకారాలు తనకోసం ఏనాడూ కోరుకోదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి మనసుకు కష్టం కలిగించేవి వచ్చినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని విడవక అండగా అందుబాటులోనే ఉంచుకుంటే ధైర్యంగా ముందుకు నీ జీవిత ప్రయాణ పయనము సాఫీగా సాగుతుంది."