Sunday, July 27, 2008

గోభీ పరాఠాకాలీఫ్లవర్ తో చేసుకునే ఈ ఉత్తరాది వంటకం బావుంటుంది. కూర లాంటిది (Side dish) లేకున్నా పర్లేదు. కావలసిన వస్తువులు: గోధుమ పిండి: అర కిలో నెయ్యి: ఒక గరిటెడు కాలిఫ్లవర్ ముక్కలు: పావు కిలో కొత్తిమీర: కొద్దిగా గరం మసాలా పొడి: తగినంత అల్లం: కొంచెం ఉప్పు: తగినంత చేసే విధానం: గోధుమపిండిలో ఒక చెంచా నెయ్యి వేసి, తగినంత ఉప్పు, సరిపడా నీరు పోసి ముద్దగా కలపి తయారుగా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం సన్నగా తరిగి, గరం మసాలా పొడి కలిపి, అందులో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలు కలిపి ఉంచుకోవాలి. గోధుమపిండిని గుండ్రంగా వత్తుకుని, అందులో కాలిఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి మళ్ళీ ఉండలుగా చేసుకోవాలి. దాన్ని విడిపోకుండా మరలా గుండ్రంగా, పల్చగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న పరాఠాల్ని పెనమ్మీద నెయ్యతో వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఓపికనీ, జిహ్వ చాపల్యాన్నీ బట్టి కర్రీ ఏదైనా చేసుకోవచ్చు

recipe for diabetes

1 paunDu dOsakaayalu
1/16 paunDu pachchimirapa kaayalu
1Teespuunu allam
1Teespuunu uppu
1/8 lb pacci kobbari
2 Taebil spuunu Sanaga pappu
2 Taebil spuunu nuune
1/4 Teespuunu inguva
1/4 Teespuunu(6 rebbalu) kari vaepaaku
2 enDu mirci
2 Teespuunu taaliMpu giMjalu
tayaaruchaeyupaddhati
dOsa kaayalu poTTuteesi cEdugaa undO laedO ruchi choosi mukkalugaa chaesi
baaMDIlO nuune vEDi chaesi. enDu mirci, taaliMpu giMjalu Sanaga pappu, pasupu vaesi, taaliMpu giMjalu ciTa paTa mannaaka
dOsakaaya mukkalu vaesi renDu nimushaalu vaeyiMchi taruvaata oka glaasu neeLLu pOsi uDikincaali
eelOgaa kobbari, allam, pachchimirapa kaayalu oka mikseelO vaesi rubbi aa muddanubaaNeelO vaesae uppuvaesi padi nunDi padihaenu nimushaalu vaMDi
dimpi kottimeeratO almkariMchi.
VaeDi annam lo kalipi neyyinivaesi tinTae caalaa baaguMTuMdi
దోసకాయ కూర
1 పౌండు దోసకాయలు
1/16 పౌండు పచ్చిమిరప కాయలు
1టీస్పూను అల్లం
1టీస్పూను ఉప్పు
1/8 ల్బ్ పచ్చి కొబ్బరి
2 టేబిల్ స్పూను శనగ పప్పు
2 టేబిల్ స్పూను నూనె1
/4 టీస్పూను ఇంగువ
1/4 టీస్పూను(6 రెబ్బలు) కరి వేపాకు
2 ఎండు మిర్చి
2 టీస్పూను తాలింపు గింజలు
తయారుచేయుపద్ధతి
దోస కాయలు పొట్టుతీసి చేదుగా ఉందో లేదో రుచి చూసి ముక్కలుగా చేసిబాండీలోనూనె వేడి చేసి. ఎండు మిర్చి, తాలింపు గింజలు శనగ పప్పు, పసుపు వేసి, తాలింపు గింజలు చిట పట మన్నాక దోసకాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి తరువాత ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి
ఈలోగా కొబ్బరి, అల్లం, పచ్చిమిరప కాయలు ఒక మిక్సీలో వేసి రుబ్బి ఆ ముద్దనుబాణీలో వేసే ఉప్పువేసి పది నుండి పదిహేను నిముషాలు వండి దింపికొత్తిమీరతో అలంకరించి.
వేడి అన్నం లొ కలిపి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది.